| శ్రీరామ | |
| సనాతన సాధక సమష్టి - పరిచయము | |
| మహాశయా ! నమస్కారము ! | |
| భారత దేశము సనాతన ధర్మానికి పుట్టినిల్లు. ప్రతి ఒక్కరూ | |
| సామాన్యముగా కోరుకునే సుఖసంతోషాలను, సామరస్యమును, | |
| స్థిరత్వమును, శాంతిని తరతరాలుగా శాశ్వత ప్రాతిపదికమీద | |
| అందజేసే జీవన విధానము మన దేశములోను, తద్ద్వారా యావత్ | |
| ప్రపంచములోను ఈ సనాతన ధర్మము వలన రూపు దిద్దుకొనినది. | |
| సశాస్త్రీయము, సర్వోత్కృష్టము అయిన ఈ సనాతన ధర్మము - | |
| సనాతన జీవన విధానము – సనాతన జీవన వ్యవస్థలను గుఱించిన | |
| సరియగు అవగాహన, ఆచరణలు నానాటికి లోపించి స్వేచ్ఛాచరణ, | |
| అంతులేని స్వార్థములు ప్రబలినవి. వీటి కారణముగా ఈనాడు | |
| భ్రష్టాచరణ, ఉగ్రవాదము, అరాచకము, అవ్యవస్థలు ఏర్పడి | |
| సుఖశాంతులు లోపించుచున్నవి. మంచితనము, మంచివాళ్ళ బలము | |
| తగ్గుచున్నవి. చెడుతనము, చెడువాళ్ళ బలము పెరుగుచున్నవి. | |
| గృహస్థులకు జీవితము రాను రాను దుర్భరముగా మారుచున్నది. | |
| మారిన ఈనాటి పరిస్థితులలో, అనగా నేటి ప్రజారాజ్య వ్యవస్థలో, | |
| ఈ దుఃస్థితిని చక్కదిద్ద వలసిన బాధ్యత ప్రభుత్వముమీదనే కాక | |
| సమాజము లోని అందరు వ్యక్తులమీద కూడా యున్నది. | |
| ఈ దిశలో ఆలోచించు ఆధునికులు కొందరు – ముఖ్యముగా | |
| భౌతికముగా అభివృద్ధి చెందిన దేశములలోని జీవనశైలిని ఆదర్శముగా | |
| భావించువారు – నేటి ఆచరణకు సనాతన ధర్మము యోగ్యము | |
| కానిదిగా తలచుచున్నారు. కాని సనాతనం అనగా సదాతనం, శాశ్వతం | |
| అనియు, ఎల్ల వేళలా వర్తించునది అనియూ అర్థము. | |
| సామాజిక దుఃస్థితికి పరిష్కారములు - | |
| భౌతిక విలువలపై ఆధారపడిన పాశ్చాత్య సభ్యత, జీవన విలువలకన్న, | |
| మానవతా విలువలను రక్షించు ఆధ్యాత్మిక విలువల పైన | |
| ఆధారపడిన సనాతన సభ్యత, జీవన వ్యవస్థలలో కలవు. దీనికి | |
| ఆధునిక పరిస్థితులలో సనాతనము యొక్క ఆవశ్యకతను, | |
| ప్రయోజనములను గుర్తించ వలసిన అవసరము ఉన్నది. | |
| వ్యక్తులు బాగున్నదానికన్నా, సమాజము బాగున్నప్పుడే అందరికీ | |
| మేలు జరుగుతుంది. మనిషికి స్వార్థం సహజం. ఎవరి బాగు వరకే | |
| వారు చూసుకుంటూంటే, సమాజం బాగు చూసేవారు ఎవరు? అందుకే, | |
| విశాల హితం కోరేవారు కొందరైనా మార్గనిర్దేశనం చేస్తూంటే, | |
| సమాజహితం కోసం స్వార్థాన్ని పరిమితులలో నుంచుకుని, ఉదార | |
| భావాలతో ఉంటూ, ” మానవ సేవయే మాధవ సేవ ! ” అని ఆచరణలో | |
| పెట్టే సజ్జనుల అవసరం ఏ సమాజానికైనా ఉండితీరుతుంది. మన | |
| అదృష్టం ఏమిటంటే – మన సమాజ నిర్మాతలైన మహర్షుల దూరదృష్టి | |
| వలన, మన భారతీయ సమాజంలో అట్టి సజ్జనుల సంఖ్య బహుళంగా | |
| ( లక్షలూ, కోట్లలో ) ఉంటూ వచ్చింది. పాశ్చాత్య వ్యామోహం వల్ల | |
| దృష్టికోణంలో వస్తూన్న మార్పుల వలన, సంకుచిత స్వార్థం పెరుగుతూ, | |
| సమాజ విముఖతకు లోనయ్యే సామాన్య జనుల సంఖ్య పెరిగిపోతోంది ! | |
| సమాజ విముఖతకు లోనుకాకుండా, మానవ శ్రేయస్సుతో పాటు | |
| ” ఈ భారత దేశము నాది ! భారతీయులందరూ నా వావాళ్ళు ! | |
| ఈ దేశ సంస్కృతీ ధర్మములను రక్షించటం నా బాధ్యత ! ఈ వారసత్వ | |
| సంస్కృతీ సంపద తరతరాలకూ అవిచ్ఛిన్నంగా వర్ధిల్లుతూనే ఉండాలి ! | |
| మనమంతా కలిసి మెలిసి బ్రతకాలి ! ” అనే భావన పెరగాలి. | |
| ( The WILL TO LIVE TOGETHER must percolate | |
| to more people.) ఇటువంటి ఆలోచనలను, ఆచరణలను అందరిలో | |
| పెంపొందించాలి. ఇది సమాజ శ్రేయస్సుకూ, మానవాళి శ్రేయస్సుకూ, | |
| మనుగడకూ అత్యవసరము. ఈ లక్ష్య సాధనకై, ” సనాతన సాధక | |
| సమష్టి ” ఉద్యమము 1956 వ సం.లోప్రారంభింప బడినది. | |
| ఈ ఉద్యమములో క్రొత్తగా తెచ్చుకొనవలసిన గురు – శిష్య సంబంధాలు | |
| లేవు. సభ్యత్వ రుసుములు, చందాలు, అధ్యక్షుడు, కార్యదర్శి ఇత్యాది | |
| పదవులూ లేవు. కావలసినదల్లా – తమ చేయూత, స్వచ్ఛంద | |
| సహకారములు మాత్రమే ! మన దేశములో ఈ ఉద్యమము అనేక | |
| ఊళ్ళలో కొనసాగుచున్నది. | |
| పరస్పర సదవగాహనకై, ఇట్టి ఉద్దేశ్యములు కలిగిన వ్యక్తులు | |
| తమతమ ఊళ్ళలో/ పేటలలో వారమునకు ఒకసారి ఒక గంటసేపు | |
| సమావేశ మగుట ప్రధాన విషయము. | |
| సమష్టిని పెంచుట, సంతతి శ్రేయస్సు, పురుషార్థ సాధన, సర్వాంగీణ | |
| జీవన వ్యవస్థ, సనాతన ధర్మ సంరక్షణ, సనాతన సంప్రదాయ పరిరక్షణ, | |
| సనాతన సమాజ రక్షణ, లోకసంగ్రహ ఆదర్శం మొదలగు | |
| విషయములను గూర్చియూ, జీవిత సమస్యలను గూర్చియూ, | |
| విచారవిమర్శలూ, విచార వినిమయములూ ఈ సమావేశములలో | |
| జరుగును. సముచితమైన నిర్ణయములకు కార్యరూపము నిచ్చుటకై | |
| సాధన జరుగును.దానికిగాను అంశత్రయ కార్యక్రమమును | |
| ( 3 – Point Programme ) తీసుకున్నాము. | |
| ఈ సమావేశములలో తమరుకూడా పాల్గొని, | |
| చేయూత నీయవలసినదిగా ప్రార్థన ! | |
| ఇట్లు, | |
| సనాతన సాధక సమష్టి. | |
టాగులు: భారతీయ సమాజం